పునీత్ మరణవార్తతో రైతుకు గుండెపోటు

ABN , First Publish Date - 2021-10-30T16:29:06+05:30 IST

యువరత్న పునీత్‌రాజ్‌కుమార్‌ మృతిచెందారనే విషయం తెలుసుకున్న అభిమాని గుండెపోటుకు గురై మృతిచెందారు. చామరాజనగర్‌ జిల్లా హనూరు తాలూకా పొన్నాచి గ్రామపంచాయతీ పరిధిలోని మరూరు

పునీత్ మరణవార్తతో రైతుకు గుండెపోటు

బెంగళూరు(Karnataka): యువరత్న పునీత్‌రాజ్‌కుమార్‌ మృతిచెందారనే విషయం తెలుసుకున్న అభిమాని గుండెపోటుకు గురై మృతిచెందారు. చామరాజనగర్‌ జిల్లా హనూరు తాలూకా పొన్నాచి గ్రామపంచాయతీ పరిధిలోని మరూరు గ్రామంలో విషాదం నెలకొంది. పొలం పనులకు వెళ్లి ఇంటికి చేరిన మునియప్ప (28) అనే రైతు టీవీలో ప్రసారమవుతున్న పునీత్‌ మృతి విషయాన్ని వీక్షించాడు. అభిమాన నటుడు మృతిచెందారనే ఆవేదనకు లోనైన మునియప్ప టీవీ చూస్తూనే కుప్పకూలాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. మునియప్పకు భార్య, ఇద్దరు పిల్లలతోపాటు చెల్లెలు ఉన్నారు. 


Updated Date - 2021-10-30T16:29:06+05:30 IST