Bengaluru: థియేటర్ల వద్ద పునీత్కు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-11-08T17:09:58+05:30 IST
పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 థియేటర్ల వద్ద ఏకకాలంలో నివాళులు అర్పించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పునీత్ భావచిత్రానికి పూలమాలలు వేసి దీపాలు వెలి
బెంగళూరు: పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 థియేటర్ల వద్ద ఏకకాలంలో నివాళులు అర్పించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పునీత్ భావచిత్రానికి పూలమాలలు వేసి దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. బెంగళూరులోని మల్టిప్లెక్స్ సహా అన్ని థియేటర్ల వద్ద పునీత్కు సంతాపం ప్రకటించారు. థియేటర్ల యజమానులు, నిర్వాహకులు, అభిమానులు పెద్దసంఖ్యలో భాగస్వామ్యులయ్యారు. బెంగళూరులోని వీరేశ్ థియేటర్ వద్ద అభిమానుల ‘అప్పు’ నినాదాలు మారు మోగాయి. మండ్య గురుశ్రీ థియేటర్ వద్ద, హుబ్బళ్లిలో అప్సరా థియేటర్ వద్ద, విజయపురలోని గౌరిశంకర్ థియేటర్ వద్ద అభిమానులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.