పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన Cm

ABN , First Publish Date - 2021-11-06T16:32:14+05:30 IST

పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం పరామర్శించారు. పునీత్‌ భార్య అశ్వినికి సాంత్వన పలికారు. పునీత్‌ లేనిలోటు తీర్చలేనిదన్నారు. బాధను భరించే శక్తి

పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన Cm

బెంగళూరు(Karnataka): పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం పరామర్శించారు. పునీత్‌ భార్య అశ్వినికి సాంత్వన పలికారు. పునీత్‌ లేనిలోటు తీర్చలేనిదన్నారు. బాధను భరించే శక్తి భగవంతుడు ఇవ్వాలన్నారు. పునీత్‌ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, బంధువులు చెన్నేగౌడ, ఎస్‌ఏ గోవిందరాజ్‌, యువరాజ్‌కుమార్‌ ఉన్నారు. సీఎం వెంట రెవెన్యూ మంత్రి అశోక్‌, ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ తదితరులు ఉ న్నారు. 


16న పునీత్‌ శ్రద్ధాంజలి సభ 

కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి, చందనసీమ సంయుక్తంగా బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో ఈనెల 16న పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ శ్రద్ధాంజలి సభను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సభను ప్యాలెస్‌ మైదానంలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కన్నడ సినీరంగంతోపాటు తెలుగు, తమిళ సినీరంగాలకు చెందిన పలువురు ప్రముఖులను శ్రద్ధాంజలి సభకు ఆహ్వానించాలని నిర్ణయించినట్టు మండలి అధ్యక్షుడు జయరాజ్‌ మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-11-06T16:32:14+05:30 IST