బ్రేకింగ్ : పుంగనూరు మాజీ ఎమ్మెల్యే మృతి

ABN , First Publish Date - 2020-04-05T02:34:01+05:30 IST

పుంగనూరు మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు.

బ్రేకింగ్ : పుంగనూరు మాజీ ఎమ్మెల్యే మృతి

చిత్తూరు : జిల్లాలోని పుంగనూరు మాజీ ఎమ్మెల్యే రాణి సుందరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రేపు అనగా ఆదివారం రోజున పుంగనూరు పట్టణం నందు ఆమె దహన క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. సుందరమ్మ ఇకలేరన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ అనూషా రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-04-05T02:34:01+05:30 IST