Puneethకు బసవశ్రీ పురస్కారం
ABN , First Publish Date - 2022-05-04T17:31:17+05:30 IST
చిత్రదుర్గ మురుఘామఠం బసవశ్రీ పురస్కారాన్ని పునీత్రాజ్కుమార్కు మరణానంతరం ప్రదానం చేసింది. బసవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మఠంలో జరిగిన ప్రత్యేక
- సతీమణి అశ్వినికి ప్రదానం చేసిన మురుఘా మఠం
బెంగళూరు: చిత్రదుర్గ మురుఘామఠం బసవశ్రీ పురస్కారాన్ని పునీత్రాజ్కుమార్కు మరణానంతరం ప్రదానం చేసింది. బసవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మఠంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పునీత్ భార్య అశ్వినీపునీత్ రాజ్కుమార్కు అందించారు. మురుఘామఠాధిపతి డాక్టర్ శివమూర్తి స్వామీజీ పురస్కారంతో పాటు రూ. 5 లక్షల నగుదు, మెమొంటోను అందించారు. స్వామీజీ మాట్లాడుతూ కన్నడ కంఠీరవ రాజ్కుమార్ ముద్దుల కుమారుడు పునీత్ నటుడు, గాయకుడిగానే కాకుండా సమాజసేవలోను రాణించారన్నారు. పునీత్ అకాల మృతి బాధాకరమన్నారు. కన్నడ చలనచిత్ర రంగంలో మేటి నటుడని కొనియాడారు. వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్, ఎమ్మెల్యే తిప్పారెడ్డి, జిల్లా అధికారి కవితా మన్నికేరి, సీఈఓ నందినిదేవ, జిల్లా ఎస్పీ పరుశురాం తదితరులు పాల్గొన్నారు.