ప్యూమా దేశీయ మొబైల్ యాప్
ABN , First Publish Date - 2022-06-11T05:35:57+05:30 IST
జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ‘ప్యూమా’ భారత్లో మొబైల్ షాపింగ్ యాప్ని ఆరంభించింది.
జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ‘ప్యూమా’ భారత్లో మొబైల్ షాపింగ్ యాప్ని ఆరంభించింది. తన ఉత్పత్తులను భారత కస్టమర్లకు త్వరితగతిన అందించేందుకు ఈ చొరవ చూపింది. ఇండియన్ మార్కెట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇటువంటి వెసులుబాట్లకు తెరతీసింది. గత ఏడాది డిసెంబర్తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇండియాలోనే ప్యూమా రూ.2044 కోట్ల మేర రెవెన్యూని సాధించింది. ఒక్క ఏడాదిలోనే ఆదాయంలో 68.2 శాతం మేర వృద్ధిని సాధించింది. అలాగే నూతనంగా 51 స్టోర్లను జతచేసింది. దీంతో మన దేశంలో ప్యూమా స్టోర్స్ సంఖ్య 450 అయింది. అభిమానులు ఇక తమకు ఇష్టమైన స్నీకర్లు, క్లాత్తో రూపొందిన బూట్లు, యాక్సెసరీలను ఈ యాప్తో పొందవచ్చు అలాగే వర్చ్యువల్ ట్రై ఆన్, 3డి యానిమేషన్స్ అనుభవాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ప్యూమా అంబాసిడర్గా ఉన్న క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా ఈ యాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.