Jammu Kashmir: పుల్వామాలో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత!

ABN , First Publish Date - 2021-07-14T14:47:49+05:30 IST

పుల్వామాలో సెక్యూరిటీ ఫోర్స్, ఉగ్రవాదుల మధ్య...

Jammu Kashmir: పుల్వామాలో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత!

శ్రీనగర్: Jammu Kashmirలోని పుల్వామాలో సెక్యూరిటీ ఫోర్స్, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ ఉగ్రవాది అజయ్ కూడా ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పుల్వామాలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందుకున్న రక్షణ బలగాలు ఈ ప్రాంతంలో దాడులు నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు ఫైరింగ్ ప్రారంభించారు. వెంటనే రక్షణ దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ పరస్పర దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పుల్వామా పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

Updated Date - 2021-07-14T14:47:49+05:30 IST