బాలాత్రిపుర సుందరికి డ్రైఫూట్స్తో అలంకరణ
ABN , First Publish Date - 2021-10-21T05:04:25+05:30 IST
గోష్పాదక్షేత్రంలో బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు.
కొవ్వూరు, అక్టోబరు 20: గోష్పాదక్షేత్రంలో బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఆశ్వయుజ పూర్ణిమ (శరత్ పూర్ణిమ)ను పురప్కరించుకుని ఆలయ అర్చకులు మానేపల్లి శ్రీనివాసరావు, సుందర గణేష్ ఆధ్వర్యంలో అమ్మవారిని డ్రైఫూట్స్తో విశేష అలంకరణ చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.