జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన పుదుచ్చేరి సర్కార్

ABN , First Publish Date - 2021-06-22T05:18:53+05:30 IST

జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన పుదుచ్చేరి సర్కార్

జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన పుదుచ్చేరి సర్కార్

పుదుచ్చేరి: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 30 వరకు కొవిడ్-19 ఆంక్షలను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు సహా సమాజిక, వ్యక్తిగత వినోదాత్మక సమావేశాలపై నిషేధం యధాతథంగా కొనసాగనుంది. వాణిజ్య, వ్యాపార సంస్థలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపింది.

Updated Date - 2021-06-22T05:18:53+05:30 IST