పుదుచ్చేరి వాసులకు బంపర్ ఆఫర్...
ABN , First Publish Date - 2021-04-11T16:40:30+05:30 IST
పుదుచ్చేరిలో కరోనా రెండవ దశ కారణంగా టీకాలు వేయుంచుకున్న వారికి హోటళ్లలో 10 శాతం రాయితీ కల్పించనున్నట్టు పుదుచ్చేరి
- టీకా వేసుకొంటే హోటళ్లలో 10 శాతం రాయితీ...
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో కరోనా రెండవ దశ కారణంగా టీకాలు వేయుంచుకున్న వారికి హోటళ్లలో 10 శాతం రాయితీ కల్పించనున్నట్టు పుదుచ్చేరి హోటల్ యజమానుల సంఘం ప్రకటించింది. కరోనా తీవ్రత పెరగడంతో పుదుచ్చేరి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హోటల్ యజమానులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు టీకాలు వేసే శిబిరం కదిర్గామ్ ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగింది. మొత్తం 500 మందికి పైగా ఒకేరోజు టీకా వేసుకున్నారు. పుదుచ్చేరిలోని లాడ్జీలు, రెస్టారెంట్లు యజమానుల సంఘం టీకా వేసుకోవడాన్ని ప్రోత్సహించేలా టీకా వేయించుకున్న సర్టిఫికేట్ను సమర్పించే వారికి వారు తినే భోజనానికి 10 శాతం రాయితీ అందజేయనున్నట్ట్టు ప్రకటించింది.