విపక్షాలపై పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2021-09-29T22:41:05+05:30 IST
విపక్షాలపై పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు మిడతల దండులా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు.
హైదరాబాద్: విపక్షాలపై పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు మిడతల దండులా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో రాష్ట్రప్రభుత్వానికి ప్రతిరోజూ పది ప్రశ్నలు సంధిస్తున్నారని తెలిపారు. ‘‘ప్రధాని మోదీ దేశానికి, తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి చెప్పాలని తెలిపారు. సంజయ్కు నేను తొమ్మిది ప్రశ్నలు సంధిస్తున్నా. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరో డ్రామాకు తెరలేపుతున్నారు. రేవంత్ది నిరుద్యోగ సైరన్ కాదు.. కలెక్షన్ సైరన్’’ జీవన్రెడ్డి దుయ్యబట్టారు.