వైఎస్‌ఆర్‌టీపీతోనే ప్రజా సంక్షేమం

ABN , First Publish Date - 2022-05-27T04:49:58+05:30 IST

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని అలంపూర్‌ నియో జకవర్గ కో ఆర్డినేటర్‌ ప్రేమ్‌రాజ్‌ అన్నారు.

వైఎస్‌ఆర్‌టీపీతోనే ప్రజా సంక్షేమం
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌టీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ప్రేమ్‌రాజ్‌

- నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ప్రేమ్‌రాజ్‌

అయిజ, మే 26 : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని అలంపూర్‌ నియో జకవర్గ కో ఆర్డినేటర్‌ ప్రేమ్‌రాజ్‌ అన్నారు. అయిజలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం ఆయన కుమార్తె షర్మిల పార్టీని స్థాపించారని, ప్రజల సమస్యలు తెలుసుకు నేందుకు పాదయాత్ర చేస్తున్నారని వివరించారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రతీ గడపకు పార్టీ లక్ష్యాలు, చేపట్టాల్సిన పనులను గడపగడపకూ తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు తెలంగాణ పార్టీ’ కరపత్రం, సేవాదళ్‌ లోగోలను విడుదల చేశారు. కార్యక్రమంలో జనరల్‌ సెక్రటరీ రాజమౌళి, యువజన అధ్యక్షుడు కాకే నాగరాజు, నాయకులు వెంకట్రాములు, మోహన్‌రాజ్‌, మైనారిటీ సెల్‌ నాయకులడు తూముకుంట బాషా, చిన్న గుండన్న, సుధాకర్‌, నరసింహులు, ఇమ్మానియేల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T04:49:58+05:30 IST