ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-05-21T06:02:15+05:30 IST
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు.
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం, మే 20 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. శుక్రవారం ధర్మారం మండలం గోపాల్రావుపేటలో పలు అభివృద్ధి పనులకు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గోపురం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసం దర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గ్రామా లను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం నిధుల ను మంజూరు చేస్తుందని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుం దని ఆయన చెప్పారు. దళితులను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ముఖ్య మంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంను అమలుచేశారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ స భ్యురాలు పూస్కూరి పద్మజ, నందిమేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, గ్రామ సర్పంచ్ అంజయ్య. ఎంపీటీసీ సభ్యు రాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.