అందరూ పెళ్లి సందడిలో ఉండగా.. అతను ఆ పని చేయబోయాడు.. అడ్డుచెప్పిన వారిని అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-25T14:14:14+05:30 IST

ఒకవైపు పెళ్లి జరుగుతుంటే.. మరోవైపు ఒక యువకుడు తన పనిలో తాను ఉన్నాడు. ఇదేంటి ఈ పాడు పని ఇక్కడ చేయొద్దు అని అడ్డుచెప్పినందుకు గొడవకు దిగాడు. ఆ తరువాత సమయం చూసి ఆ అడ్డు చెప్పిన వ్యక్తిపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు...

అందరూ పెళ్లి సందడిలో ఉండగా.. అతను ఆ పని చేయబోయాడు.. అడ్డుచెప్పిన వారిని అతను ఏం చేశాడంటే..

ఒకవైపు పెళ్లి జరుగుతుంటే.. మరోవైపు ఒక యువకుడు తన పనిలో తాను ఉన్నాడు. ఇదేంటి ఈ పాడు పని ఇక్కడ చేయొద్దు అని అడ్డుచెప్పినందుకు గొడవకు దిగాడు. ఆ తరువాత సమయం చూసి ఆ అడ్డు చెప్పిన వ్యక్తిపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..


దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే హేమంత్ కుమార్(25) అనే యువకుడు ఉదయాన్నే తన స్నేహితుడు నిఖిల్‌‌తో టీ తాగేందుకు వెళ్లాడు. అక్కడ టీ తాగుతుండగా.. నలుగురు యువకులు అక్కడికి వచ్చి అతనిపై కత్తితో దాడి చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే హేమంత్ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.


దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడు ధృవ్(20) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేయగా.. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. ధృవ్, హేమంత్ మధ్య ఇంతకుముందు గొడవ జరిగిందని అదే హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. 




పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 17న ఒక పెళ్లి జరుగుతుండగా.. ధృవ్ వేడుకలోనే మూత్ర విసర్జన చేయబోయాడు. అప్పుడు హేమంత్, ఇతరులు ధృవ్‌ని అడ్డుకున్నారు. 'ఇక్కడ ఈ పని ఏంటని' అతడిని మందలించారు. దానికి ధృవ్ వారితో గొడవపడ్డాడు. చివరికి అందరి ముందు ఏమి చేయలేక వెళ్లిపోయాడు. కానీ తనకు పెళ్లిలో అందరిముందు అవమానించిన హేమంత్‌ని మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం హేమంత్ తన స్నేహితుడితో కలిసి టీ షాపులో ఉండగా.. అతడిని కత్తితో పొడిచి చంపేశాడు.

Updated Date - 2021-11-25T14:14:14+05:30 IST