ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా పనిచేయాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2022-05-25T05:18:01+05:30 IST
ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా పనిచేయాలి : ఎస్పీ
వికారాబాద్/తాండూరు, మే 24 : ప్రతీ ఉద్యోగికి బదిలీలు సాధారణమని, ఎక్కడ ఉన్నా కూడా ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరు డీఎస్పీగా సేవలందించి డీజీపీ ఆఫీసుకు బదిలీపై వెళుతున్న డీఎస్పీ లక్ష్మీనారాయణకు వీడ్కోలు కార్యక్రమంతో పాటు తాండూరు డీఎస్పీగా ఖమ్మం నుంచి బదిలీపై వస్తున్న శేఖర్గౌడ్కు ఎస్పీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ లక్ష్మీనారాయణ తాండూరు డివిజన్లో ఉత్తమ సేవలు అందించారని పేర్కొన్నారు. ఎన్నో కేసులను త్వరితగతిన పరీక్షించడంలో కృషి చేశారని ఎస్పీ కోటిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, వికారాబాద్ డీఎస్పీ, పోలీస్ అధికారులు తదితరులున్నారు.
- డీఎస్పీగా శేఖర్గౌడ్ బాధ్యతల స్వీకరణ
తాండూరు డీఎస్పీగా జి.శేఖర్గౌడ్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న లక్ష్మీనారాయణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కరన్కోట్ ఎస్ఐ మధుసూదన్రెడ్డితోపాటు పలువురు ఎస్ఐలు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సోమవారం రాత్రి బదిలీపై వెళుతున్న డీఎస్పీ లక్ష్మీనారాయణకు తాండూరు నేషనల్ గార్డెన్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు తెలిపారు.