ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2021-05-13T05:16:19+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాలి
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ 

కూర్మన్నపాలెం, మే 12: ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ అన్నారు. స్టీల్‌పాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ  కూర్మన్నపాలెంలో ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 90వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షల్లో ఎస్‌ఎంఎస్‌-2 ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఏఐటీయూసి జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నదని ఆరోపించారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, వేములపాటి ప్రసాద్‌, గంగవరం గోపి, అప్పారావు, మరియ్య, రమణ మూర్తి, వర ప్రసాద్‌, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T05:16:19+05:30 IST