ఎన్నాళ్లీ దుస్థితి!
ABN , First Publish Date - 2020-09-24T08:15:44+05:30 IST
ప్రత్తిపాడు మండలంలోని సబ్ప్లాన్ ఏజెన్సీ కొండలపై రహదారులు అభివృద్ధి చెందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు
రహదారులు అధ్వానం - ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం
ప్రత్తిపాడు, సెప్టెంబరు 23: ప్రత్తిపాడు మండలంలోని సబ్ప్లాన్ ఏజెన్సీ కొండలపై రహదారులు అభివృద్ధి చెందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బురదకోట, బాపన్నదార, కేముత్తువాడ, కొండపల్లి గిరిజన గ్రామాలు ఎతైన కొండలపై ఉన్నాయి. వీటికి వెళ్లే కొండదిగువ మార్గం వద్ద ఉండే కిత్తమూరుపేట నుంచి కొండలపై గల గ్రామాలకు వెళ్లే ఘాట్రోడ్లన్నీ కనీస అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. తమ గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రజలు అనేక మార్లు జిల్లా అధికారులు, రంపచోడవరం ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్నవారు లేరు. ఏ చిన్న అవసరం వచ్చినా కొండదిగి వచ్చేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ సబ్ప్లాన్ ఏజెన్సీ గ్రామాల ఘాట్రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు.