ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-01-27T04:58:46+05:30 IST

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌, జనవరి 26: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు వైద్య చికిత్సలకు సాయం చేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నట్టు తెలిపారు. కడ్తాల, సాలార్‌పూర్‌, చల్లంపల్లి, చరికొండ గ్రామాల లబ్ధిదారులకు బుధవారం కడ్తాల జడ్పీటీసీ నివాసంలో చెక్కులు అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు జైపాల్‌ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు హరిచంద్‌, కృష్ణయ్య, నాయకులురామకృష్ణ, వీరయ్య, లాయక్‌అలీ, బీచ్యనాయక్‌, అంజి, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T04:58:46+05:30 IST