ఇంటర్‌ ఫలితాల్లో వెనకబడ్డ ప్రభుత్వ కళాశాలలు

ABN , First Publish Date - 2022-06-24T07:37:24+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది

ఇంటర్‌ ఫలితాల్లో వెనకబడ్డ ప్రభుత్వ కళాశాలలు
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు విద్యార్థులు

తిరుపతి (విద్య), జూన్‌ 23:  ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది.కాలేజీల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని ఆర్‌ఐవో వెంకటరెడ్డి గురువారం వెల్లడించారు. జిల్లాలోని రెండు ఏపీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో 60.81శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్‌లో 79.07, ఎయిడెడ్‌ కాలేజీల్లో  ఫస్టియర్‌లో 36.48, సెకండియర్‌లో 39.68, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో  ఫస్టియర్‌లో 60.23, సెకండియర్‌లో 67.75, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో 51.44, సెకండియర్‌లో 61.40, కాంపోజిట్‌ కళాశాలల్లో ఫస్టియర్‌లో 13.04, సెకండియర్‌లో 16.03, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో 18.41, సెకండియర్‌లో 35.38శాతం, కేజీబీవీల్లో ఫస్టియర్‌లో 40.97,  సెకండియర్‌లో 54.90, మోడల్‌స్కూళ్లలో ఫస్టియర్‌లో 33.11,  సెకండియర్‌లో 42.70 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో 57.65, సెకండియర్‌లో 62.56 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు  ఆర్‌ఐవో  తెలిపారు. 

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

తిరుపతి(విద్య), జూన్‌ 23 :ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు గురువారం  ప్రారంభమయ్యాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో  తొలిరోజు తిరుపతిలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 343మంది విద్యార్థులు హాజరయ్యారు. 110 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2022-06-24T07:37:24+05:30 IST