జూన్ 3న వాహనాల బహిరంగ వేలం : ఎస్పీ
ABN , First Publish Date - 2022-05-20T05:16:14+05:30 IST
పోలీసుల ఆధీనంలో ఉన్న వివిధ నేరాలకు సంబంధించినవి, దొరికిన వాహనాలను వేలం వేయనున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్,మే19(ఆంధ్రజ్యోతి) : పోలీసుల ఆధీనంలో ఉన్న వివిధ నేరాలకు సంబంధించినవి, దొరికిన వాహనాలను వేలం వేయనున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 108 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 3 నాలుగు చక్రాల వాహనాలపై చట్టపరమైన విధానాలను అనుసరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆరు నెలల నుంచి పైవాహనాల గురించి ఎవరూ రానందున అన్నౌన్ స్ర్కాప్ ప్రాపర్టీగా పరిగణించి వేలం వేయనున్నట్లు తెలిపారు. జూన్ 3న ఉదయం 10గంటలకు ఏఆర్ హెడ్క్వార్టర్స్ ఆదిలాబాద్లో వేలం ఉంటుందని 116 వాహనాలపై 102 సీఆర్పీసీ కేసులు నమోదు చేసి పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిజయేజనున్నట్లు తెలిపారు. సంబంధిత వాహన యజమానులు ఎవరైనా ఉంటే వాహన డాక్యుమెంట్లు చూపించి తీసుకుని వెళ్లాలన్నారు. బహిరంగ వేలలో పాల్గొనే వారు తమ వెంట వారికి సంబంధించిన ఆధార్కార్డు, ఏదైనా గుర్తింపుకార్డులు (కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదించబడినది) తీసుకొని రావాలని సూచించారు. ఎటువంటి సందేహాలకైనా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎంటీవో బి.శ్రీపాల్ 9440900676 సంప్రదించగలరని తెలిపారు.