నిజాయతీ ఉద్యోగులకు ప్రజల ఆదరణ
ABN , First Publish Date - 2022-05-23T07:23:00+05:30 IST
నిజాయతీ ఉన్న ఉద్యోగులకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. వరంగల్ జిల్లా కు బదిలీ అయిన డీఎస్పీ రఘుకు వీడ్కోలు సభ ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పంక్షన్హాల్లో పోలీసులు నిర్వహించారు.
కోదాడటౌన్, మే 22: నిజాయతీ ఉన్న ఉద్యోగులకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. వరంగల్ జిల్లా కు బదిలీ అయిన డీఎస్పీ రఘుకు వీడ్కోలు సభ ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పంక్షన్హాల్లో పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కోదాడ డివిజన్లో శాంతిభద్రతల పర్యవేక్షణలో రఘు విశేష కృషిచేశారన్నారు. అనంతరం రఘు మాట్లాడుతూ సీఐలు, ఎస్ఐ లు, కేసు పరిఽశోధనలో నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. కార్యక్ర మం లో డీఎస్పీ మోహన్కుమార్, కోదాడ పట్టణ సీఐ నర్సింహారావు, ప్రసాద్, శ్రీనివాస్, ఆంజనేయులు, నాగార్జునగౌడ్, రామలింగారెడ్డి పాల్గొన్నారు.