రూ.80 లక్షలకు చేరుకున్న పీటీడీ ఆదాయం

ABN , First Publish Date - 2020-12-05T05:20:34+05:30 IST

ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్‌ రోజువారీ ఆదాయం రూ.80 లక్షలకు చేరుకున్నది.

రూ.80 లక్షలకు చేరుకున్న పీటీడీ ఆదాయం

ద్వారకాబస్‌స్టేషన్‌, డిసెంబరు 4: ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్‌ రోజువారీ  ఆదాయం రూ.80 లక్షలకు చేరుకున్నది. కొవిడ్‌-19 అన్‌లాక్‌ తరువాత మెల్లగా కోలుకుంటున్న పీటీడీకి గడచిన నాలుగు రోజులు 850 సంస్థ బస్సుల నుంచి  సగటున రోజుకు రూ.80 లక్షలు ఆదాయం వచ్చింది.  ఇంకా  201 అద్దె బస్సులు రోడ్డెక్కితే రోజువారీ ఆదాయం కోటి రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని పీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌-19కు ముందు రీజియన్‌లో 850 సంస్థ బస్సులు, 201 అద్దె బస్సులు ద్వారా సగటున రోజుకు రూ. 1.10 కోట్లు ఆదాయం వచ్చేది.


Updated Date - 2020-12-05T05:20:34+05:30 IST