50 మంది అమ్మాయిలతో సంబంధం.. వెలుగులోకి సైకో ఆకృత్యాలు.. అతడు అంతమందిని పైశాచికంగా ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-04-15T08:30:48+05:30 IST
రెండు నెలల క్రితం జైపూర్లో ఒక యువతిపై అత్యాచారం చేసి కిరాతంగా చంపిన ఉదంతం సంచలనంగా మారింది. ఆ కేసును విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని మింటూగా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టాడు...
రెండు నెలల క్రితం జైపూర్లో ఒక యువతిపై అత్యాచారం చేసి కిరాతంగా చంపిన ఉదంతం సంచలనంగా మారింది. ఆ కేసును విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని మింటూగా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టాడు. అతడు ఇప్పటివరకు 50 మంది యువతులతో ప్రేమాయణం నడిపాడు. జైపూర్ యువతినే కాదు అంతకు ముందు కూడా మింటూ చాలా మంది అమ్మాయిలను చంపేశాడు.
పేర్లు మార్చుకుని రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటాడు. వారితో ప్రేమాయణం సాగిస్తాడు. వారితో శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటాడు. శృంగారానికి అంగీకరించని యువతులపై అత్యాచారాలకు పాల్పడతాడు. అనంతరం వారిని క్రూరంగా చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తాడు. నిందితుడు మింటూ సైకో అని, మానసిక వ్యాధిగ్రస్తుడని, సెక్స్ అడిక్ట్ అని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకుంటున్నారు.
జైపూర్ యువతి హత్య తర్వాత మింటూ కోసం పోలీసులు తీవ్రంగా అన్వేషణ సాగించారు. నిందితుడు బివాడీలో పేరు మార్చుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇన్ఫార్మర్ సహాయంతో పోలీసులు నిందితుడి ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఆల్వార్, గ్వాలియర్, జైపూర్లలో ఇప్పటికే మింటూపై కేసులు ఉన్నాయి.