హైదరాబాద్లో సైకిస్ మూడో కేంద్రం
ABN , First Publish Date - 2020-10-20T05:36:41+05:30 IST
డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ అవుట్సోర్స్ కంపెనీ సైకిస్ హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించే వ్యూ హంలో భాగంగా ఎన్ఎ్సఎల్ సెజ్లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించింది. దాదాపు 33,000 చదరపు అడుగులు విస్తరించి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ అవుట్సోర్స్ కంపెనీ సైకిస్ హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించే వ్యూ హంలో భాగంగా ఎన్ఎ్సఎల్ సెజ్లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించింది. దాదాపు 33,000 చదరపు అడుగులు విస్తరించి ఉన్న ఈ సెంటర్ ద్వారా కొత్తగా 450 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సైకి స్కు ఇప్పటికే హైదరాబాద్లో రెండు, బెంగళూరులో రెండు సీఓఈలు ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులు ఉన్నారని.. కొత్త గా ఏర్పాటు చేసిన మూడో కేంద్రంలో 450 మంది నియామకం డిసెంబరు చివ రి నాటికి పూర్తవుతుందని సైకిస్ ఇండియా కంట్రీ హెడ్ దిషంత్ భోజ్వానీ తెలిపారు. బెంగళూరు కేంద్రాలలో ఉద్యోగులను కూడా కలిపితే.. భారత్లో 2020 డిసెంబరు నాటికి 1,650 మంది ఉద్యోగులు ఉంటారు.