పీఎస్ఎల్వీ విజయంలో హైదరాబాదీ సంస్థ
ABN , First Publish Date - 2022-02-15T07:12:56+05:30 IST
అంతరిక్ష పరిజ్ఞాన రంగంలోనూ హైదరాబాద్ సంస్థలు సత్తా చాటుతున్నాయి. సోమవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)....
‘అనంత్ టెక్నాలజీస్’ కీలక పాత్ర
వాహక నౌక, ఉపగ్రహాలకు
అవసరమైన పరికరాల సరఫరా
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి బిజినెస్) : అంతరిక్ష పరిజ్ఞాన రంగంలోనూ హైదరాబాద్ సంస్థలు సత్తా చాటుతున్నాయి. సోమవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-52 మిషన్ విజయంలోనూ హైదరాబాదీ సంస్థ అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) పాలుపంచుకుంది. పీఎ్సఎల్వీ ప్రయోగ వాహక నౌకతో పాటు దాని ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలకు అవసరమైన పలు కీలక ఎలకా్ట్రనిక్స్, మెకానికల్ సబ్ సిస్టమ్స్ను ఈ కంపెనీ సరఫరా చేసింది. తిరువనంతపురం, బెంగళూరు నగరాల్లోని కంపెనీ యూనిట్ల ద్వారా ఏటీఎల్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని అనంత్ టెక్నాలజీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సుబ్బారావు పావులూరి వెల్లడించారు. ‘‘మేము ఎప్పటి నుంచో ఇలాంటి విషయాల్లో ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎ్సఎ్ససీ)తో కలిసి పని చేస్తున్నాంపీఎస్ఎల్వీ సీ-52 మిషన్ వినూత్నమైంది. ఈ ప్రయోగ వాహక నౌక అనుసంధానం, పరీక్షలు, ప్రయోగానికి సిద్ధం చేయడంలో మా కంపెనీ పాల్గొంది. వీఎ్సఎ్ససీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మేం ఈ పని పూర్తి చేశాం’’ అని సుబ్బారావు పావులూరి తెలిపారు.
30 ఏళ్ల అనుబంధం..
ఏటీఎల్ గత మూడు దశాబ్దాలుగా ఇస్రోతో కలిసి పని చేస్తోంది. ఈ 30 ఏళ్లలో ఇస్రో ప్రయోగించిన 69 ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలు, 89 ఉపగ్రహాలకు అవసరమైన కీలక ఎలకా్ట్రనిక్స్, మెకానికల్ సబ్ సిస్టమ్స్ను ఎలాంటి చిన్న లోపం (జీరో డిఫెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్) లేకుండా ఏటీఎల్ సరఫరా చేసింది. సోమవారం ప్రయోగించిన పీఎ్సఎల్వీ సీ-52 రాకెట్ ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ఆన్బోర్డ్ కంప్యూటర్స్, కంట్రోల్ ఎలకా్ట్రనిక్స్, టెలిమెట్రీ, పవర్ సిస్టమ్స్ సరఫరా వంటి కీలక పనులు ఏటీఎల్ తిరువనంతపురం యూనిట్ పూర్తి చేసింది. ఇక ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలకు అవసరమైన కొన్ని కీలక పరికరాలను ఏటీఎల్ బెంగళూరు యూనిట్ సరఫరా చేసింది.