పీఆర్‌సీ జీవోలపై పీఆర్‌టీయూ నిరసన

ABN , First Publish Date - 2022-01-20T06:19:59+05:30 IST

వేతన సవరణ, దానికి అనుబంధంగా జారీ అయిన జీవోలకు నిరసనగా పీఆర్‌టీయూ నేత రీముల నాగేశ్వరావు నేతృత్వంలో ఉపాద్యాయులు బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పీఆర్‌సీ జీవోలపై పీఆర్‌టీయూ నిరసన
జీవో ప్రతులతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు


కొయ్యూరు, జనవరి 19: వేతన సవరణ, దానికి అనుబంధంగా జారీ అయిన జీవోలకు నిరసనగా పీఆర్‌టీయూ నేత రీముల నాగేశ్వరావు నేతృత్వంలో ఉపాద్యాయులు బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్‌సీ జీవోని ఉపసంహరించుకోవాలని, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులనే కొనసాగించాలని, 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, గ్రాట్యూటీ రూ.20 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్ర, ఓ.సత్యనారాయణ, నర్సు పాపారావు తదితరులు పాల్గొన్నారు. 


ఉద్యోగులను మోసగించిన వైసీపీ ప్రభుత్వం

పాడేరు, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్‌సీతో ఉద్యోగులను మోసం చేసిందని దండకారణ్య విమోచన సమితి, దండ కారణ్య ఉద్యోగ సమితి కేంద్ర కమిటీ ప్రతినిధులు తిథిలి పాంగి, లలిత్‌ మార్కెండ్‌ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పీఆర్‌సీ అమలైనప్పుడు ఉద్యోగుల జీతాలు పెరగడం సర్వసాధారణమని, కానీ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు తగ్గేలా పీఆర్‌సీని అమలు చేయడం ఘోరమన్నారు.  ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బీసీఏ, ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-20T06:19:59+05:30 IST