పీఆర్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గం

ABN , First Publish Date - 2022-05-20T06:15:55+05:30 IST

పీఆర్‌టీయూ తిరుపతిజిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

పీఆర్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గం
విజయభాస్కర్‌ - శ్రీనివాస్‌

తిరుపతి(విద్య), మే 19: తిరుపతి ఎయిర్‌ బైపా్‌సరోడ్డులోని పీఆర్‌టీయూ కార్యాలయంలో గురువారం  తిరుపతిజిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టి.విజయభాస్కర్‌, ప్రధాన కార్యదర్శిగా చల్లా శ్రీనివా్‌సయాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు ఏఎం గిరిప్రసాద్‌ మాట్లాడుతూ.. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సంఘానికి శాశ్వత సభ్యత్వం, వోడీ సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మాట్లాడుతూ.. టీచర్ల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నాయకులు రామకృష్ణ, రాజశేఖర్‌, వెంకమరాజు, మురళి, హేమలత, శ్రీదేవి, ఝాన్సీ, సుజాత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:15:55+05:30 IST