Kurnoolలో రెచ్చిపోతున్న ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది

ABN , First Publish Date - 2022-05-26T14:21:50+05:30 IST

జిల్లాలోని ఎమ్మిగనూరులో ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది రెచ్చిపోతున్నారు. ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద అప్పు తీసుకున్నాడు.

Kurnoolలో రెచ్చిపోతున్న ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది

కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరులో ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది రెచ్చిపోతున్నారు. ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద అప్పు తీసుకున్నాడు. అయితే భార్య, బిడ్డలకు అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా వినియోగదారుడు కంతులు చెల్లించలేదు. దీంతో సదరు వ్యక్తిని ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. చివరకు ‘‘నీవు చనిపోయిన  మా రుణం చెల్లించాలి’’ అంటూ ఋణం తీసుకున్న వ్యక్తిని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది వేధింపులకు గురి చేశారు. వేధింపులు మితిమీరడంతో వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-26T14:21:50+05:30 IST