త్వరగా రేషన్కార్డులను అందించటం అభినందనీయం
ABN , First Publish Date - 2020-10-01T08:53:03+05:30 IST
నూతన విధానం ద్వారా తక్కువ సమయంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్కార్డులు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు.
-ఎమ్మెల్యే చిట్టిబాబు
పి.గన్నవరం, సెప్టెంబరు 30: నూతన విధానం ద్వారా తక్కువ సమయంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్కార్డులు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. లంకలగన్నవరంలో 20 నిమిషాలలో మంజూరైన రేషన్కార్డును లబ్ధిదారునికి అందించి అనంతరం మాట్లాడారు.
అదే విధంగా ఆర్.ఏనుగుపల్లి, కె.ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, ఎల్.గన్నవరం-2, మొండెపులంక, మానేపల్లి గ్రామాలలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్ఫేర్ సెంటర్లు నిర్మాణాలకు ఆయన భూమిపూజలు నిర్వహిచారు. అలాగే నాగుల్లంక గ్రామంలో సీసీ రహదారులు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
కిరాణా దుకాణం ప్రారంభం
వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా వై.కొత్తపల్లి గ్రామంలో ఏపీఎం వరహాలుబాబు ఆధ్వర్యంలో కిరణా దుకాణంను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాలలో డిప్యూటీ తహసీల్దార్ బి.గోపాలకృష్ణ, ఏవో కె.ప్రవీణ్, నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, యన్నాబత్తుల ఆనంద్, యన్నపు పెద్ద, దొమ్మేటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.