విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి
ABN , First Publish Date - 2021-10-20T05:04:17+05:30 IST
గిరిజన సంక్షేమ వసతి గృహం వి ద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని మాదిగ వి ద్యార్థి సమాఖ్య జిల్లా ఇన్ఛార్జ్ మానికింది వెంకటేష్ డిమాండ్ చేశారు.
మైదుకూరు, ఆక్టోబరు 19: గిరిజన సంక్షేమ వసతి గృహం వి ద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని మాదిగ వి ద్యార్థి సమాఖ్య జిల్లా ఇన్ఛార్జ్ మానికింది వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గణితం, భౌతిక, హిందీ ఉపాధ్యాయులు లేరని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, మెరుగైన సౌకర్యాలు లేవని గుర్తిం చామని, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించక పోతే ఆందోళన చేస్తామని తెలిపారు. సందర్శించిన వారిలో సంఘం నేతలు బాలాజీ, ఒరుగంటి కైలాష్ పాల్గొన్నారు.