భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి
ABN , First Publish Date - 2021-01-27T05:01:06+05:30 IST
భారతదేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయులమని గర్వపడాలని ఆదర్శ సమాజ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బూచుపాటి ఉదయకిరణ్ అన్నారు.
ఏఎ్సఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఉదయకిరణ్
కమలాపురం(రూరల్), జనవరి 26: భారతదేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయులమని గర్వపడాలని ఆదర్శ సమాజ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బూచుపాటి ఉదయకిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఆదర్శ సమాజ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ షేక్ సాదిక్, వైస్ ప్రెసిడెంట్ చెన ్నకేశవ, కార్యదర్శి పార్థసారధి, మానవ హక్కుల జిల్లా అధ్యక్షుడు పెరికల మణికంఠ, పాస్టర్ సురేంద్రబాబు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దస్తగిరి, శశికాంత్, రమణ, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.