వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-10-01T00:57:23+05:30 IST

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు: ఉత్తమ్

హైదరాబాద్‌: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టాలని చెప్పారు. టీపీసీసీ ట్రైనింగ్‌ విభాగం జూమ్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో  సీడబ్ల్యూసీ సభ్యులు సచిన్‌రావ్, ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T00:57:23+05:30 IST