ఎమ్మార్సీ భవన్కు తాళం వేసి నిరసన
ABN , First Publish Date - 2022-01-20T05:30:00+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఉల్లంఘించిన డీఈవో, కొత్తపల్లి ఎంఈవోను సస్పెండ్ చేయాలంటూ స్థానిక ఎమ్మార్సీ భవన్కు ఓ ఉపాధ్యాయుడు తాళం వేసి నిరసన తెలిపాడు.
కొత్తపల్లి, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఉల్లంఘించిన డీఈవో, కొత్తపల్లి ఎంఈవోను సస్పెండ్ చేయాలంటూ స్థానిక ఎమ్మార్సీ భవన్కు ఓ ఉపాధ్యాయుడు తాళం వేసి నిరసన తెలిపాడు.మండలంలోని దుద్యాల మెయిన్ పాఠశాలలో ఎస్జీటీ వెంకటరమణ ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గోనెగండ్ల మండల బీ అగ్రహారం గ్రామానికి బదిలీ చేస్తూ కర్నూలు డీఈవో 14-12021న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తన బదిలీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని, డీఈవో వాటిని ఉల్లంఘించారని వెంకటరమణ ఆరోపిస్తున్నారు. అలాగే ఎంఈవో ట్రెజరీకి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని స్టేషన్కు పిలిపించి విచారించి ఇంటికి పంపించారు. ఈ విషయంపై ఎంఈవోను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బదిలీ చేశామని వివరించారు.