జంతులూరులో రోడ్డుపై శవంతో బైఠాయించిన దళితులు
ABN , First Publish Date - 2021-10-23T17:16:33+05:30 IST
బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో దళితులు రోడ్డుపై శవంతో బైఠాయించారు.
అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో దళితులు రోడ్డుపై శవంతో బైఠాయించారు. దళితుల శ్మశాన వాటికకు వెళ్లకుండా ముళ్ళకంచే వేయడంపై ఆందోళనకు దిగారు. బుక్కరాయసముద్రం ఎమ్మార్వో మహబూబ్ బాషా గ్రామానికి చేరుకున్నారు. దళితులు భూ యజమానులతో చర్చిస్తున్నారు.