దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో నేడు ధర్నా
ABN , First Publish Date - 2021-01-23T06:28:41+05:30 IST
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా....
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎంఆర్వో, కలెక్టర్, చీఫ్ సెక్రటరీ కార్యాలకు వినతిపత్రాలు ఇచ్చాము. ఇందుకోసం ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలను చేపట్టాము.
ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే దళిత శక్తి ప్రోగ్రాం (డిఎస్పి) కార్యకర్తలే జనవరి 26న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు అంబేడ్కర్ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగ గ్రంథాన్ని జాతీయ జెండాల వద్ద ఉంచాలని నిర్ణయించింది. పీడిత ప్రజలను చైతన్యపరచడానికి భారత రాజ్యాంగ రథయాత్రలను ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో నిర్వహించాలని ఉద్యమం నిర్ణయించింది.
దళిత శక్తి ప్రోగ్రాం (డిఎస్పి)