AP News: వైసీపీ నాయకులకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-08-09T02:42:30+05:30 IST
Kurnool: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలింది. ఆదోనిలోని ఇందిరానగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వైసీపీ నాయకులు వివరిస్తుండగా.. అర్హులైన వారికి కూడా ‘అమ్మ ఒడి’ డబ్బులు పడలేదని సుశీలమ్మ అనే మహిళ బుట్టా రేణుకను
Kurnool: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ (YSRCP) నాయకులకు నిరసన సెగ తగిలింది. ఆదోనిలోని ఇందిరానగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి (Sai Prasada Reddy), మాజీ ఎంపీ బుట్టా రేణుక (Butta Renuka) పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వైసీపీ నాయకులు వివరిస్తుండగా.. అర్హులైన వారికి కూడా ‘అమ్మ ఒడి’ డబ్బులు పడలేదని సుశీలమ్మ అనే మహిళ బుట్టా రేణుకను ప్రశ్నించారు. రోడ్లు, మురుగుకాలువలు నిర్మించాలని వేడుకున్నా.. ఎందుకు పట్టించుకోరని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఎస్సీ కాలనీ మహిళలు నిలదీశారు.