భూ సమస్య పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కి నిరసన
ABN , First Publish Date - 2021-01-27T05:36:57+05:30 IST
Climb the cell tower and protest to solve the land problem
కరీంనగర్ రూరల్, జనవరి 26: తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ అనుబంధ గ్రామానికి చెందిన మాదాసు లక్ష్మయ్య సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామస్థులు సర్ధి చెప్పడంతో కిందకు దిగాడు. ఈ విషయమై ఆర్ఐ రజనీకాంత్రెడ్డిని వివరణ కోరగా లక్ష్మయ్యకు సంబంధించిన భూ సమస్య ఎప్పుడో పరిష్కరించామన్నారు.