ధరలు తగ్గించాలని నిరసన

ABN , First Publish Date - 2022-05-29T04:08:35+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, సరుకుల ధరలను తగ్గించాలని శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదు ట వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి నాయకుడు రామడుగు లక్ష్మణ్‌, జిల్లా కార్యవర్గసభ్యులు సుదర్శన్‌, సత్యనారాయణలు మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చేసింది శూన్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు

ధరలు తగ్గించాలని నిరసన
తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

మందమర్రిటౌన్‌, మే 28: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, సరుకుల ధరలను తగ్గించాలని శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదు ట వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి నాయకుడు రామడుగు లక్ష్మణ్‌, జిల్లా కార్యవర్గసభ్యులు సుదర్శన్‌, సత్యనారాయణలు మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చేసింది శూన్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. నల్లధనాన్ని తీసుకువస్తానని చెప్పి దేశ ధనాన్ని ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. నాయకులు ఆర్‌. వెంకన్న, జెట్టి మల్లయ్య, దుర్గరాజ్‌, రాజేష్‌, నాగరాజు, వజ్ర, రసూల్‌, ప్రభా కర్‌, తిరుపతి, శ్రీనివాస్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T04:08:35+05:30 IST