బండలింగాపూర్ను మండలంగా ప్రకటించాలని నిరసన
ABN , First Publish Date - 2022-08-14T06:44:54+05:30 IST
మండలంలోని బండలింగపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నినాదాలు చేస్తూ ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలుపుతూ శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
మెట్పల్లి రూరల్, ఆగస్టు 13 : మండలంలోని బండలింగపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నినాదాలు చేస్తూ ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలుపుతూ శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేజర్ గ్రామైన బండలింగాపూర్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సాధన కమిటీ సభ్యులు మంచె శేఖర్, బావు రవిగౌడ్, జంగిటి రాజేందర్, రేండ్ల శ్రీనివాస్, పెరుమండల్ల వెంకటేష్, ఆవుల రాహుల్, మామిడిపల్లి రమేశ్, యంసాని లక్ష్మణ్, నేమురి ప్రేమ్, కొలి నిఖిల్, పాల్గొన్నారు.