తలసానికి నిరసన సెగ

ABN , First Publish Date - 2022-03-06T17:57:12+05:30 IST

మంత్రి తలసాని శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. మంత్రి సభలో ప్రసంగిస్తుండగా జీహెచ్ఎంసీ మహిళా కార్మికుల ఆందోళనకు దిగారు.

తలసానికి నిరసన సెగ

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. మంత్రి సభలో ప్రసంగిస్తుండగా జీహెచ్ఎంసీ మహిళా కార్మికుల ఆందోళనకు దిగారు. తమకు జీతాలు పెంచాలని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని సార్లు అడిగిన మాట దాటేస్తున్నారని మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. కార్మికులు ఆందోళన సద్దమణిగిన తర్వాత తలసాని ప్రసంగించారు. కరోనా వేళ జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని కొనియాడారు. మహిళా కార్మికులకు రూ.12 వేల జీతం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని తలసాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

Updated Date - 2022-03-06T17:57:12+05:30 IST