రోడ్లు ఊడుస్తూ నిరసన
ABN , First Publish Date - 2021-06-14T04:39:13+05:30 IST
సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాజాం మునిసిపల్ కార్మికులు ఆదివారం రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు.
రాజాం రూరల్, జూన్ 13: సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాజాం మునిసిపల్ కార్మికులు ఆదివారం రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు.