హత్య కేసులో దోషులను శిక్షించాలి

ABN , First Publish Date - 2021-10-20T05:08:20+05:30 IST

దళిత యువకుడిని అత్యంత దుర్మార్గంగా హత్యచేసిన దోషులను శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

హత్య కేసులో దోషులను శిక్షించాలి
ధర్నా నిర్వహిస్తున్న దళిత సంఘాల నాయకులు

కొవ్వూరు, అక్టోబరు 19: దళిత యువకుడిని అత్యంత దుర్మార్గంగా హత్యచేసిన దోషులను శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఈ నెల 6న గెడ్డం శ్రీనివాస్‌ను హత్యచేసిన సంఘటనకు నిరసనగాకేవీపీఎస్‌. కేఎన్‌పీఎస్‌, ఎమ్మార్పీఎస్‌, మాలమహానాడు, జగ్జీవన్‌రామ్‌ యూత్‌, దళిత బహుజన సంఘాల ఆధ్వ ర్యంలో మంగళవారం డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్రా న్సిస్‌, జాన్‌రాజు, రామకృష్ణ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలన్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఆండ్ర మాల్యాద్రి, ప్రభాకర్‌, చిట్టిరాజు, వెంకటరమణ, నక్కా వెంకటరత్నం, బొంతా శ్యాం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:08:20+05:30 IST