పోలీసుల నిర్బంధంపై నిరసన

ABN , First Publish Date - 2020-10-02T08:27:59+05:30 IST

వెల్ఫేర్‌బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులను తక్షణం వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ..

పోలీసుల నిర్బంధంపై నిరసన

పిఠాపురం, అక్టోబరు 1: వెల్ఫేర్‌బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులను తక్షణం వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. చలో కలెక్టరేట్‌ వెళుతున్న సీఐటీయూ నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయలేరని చెప్పారు. నిధుల మళ్లింపునకు సంబంధించిన జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కూరాకుల సింహాచలం, కోనేటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T08:27:59+05:30 IST