పెట్రో మంటలపై నిరసన

ABN , First Publish Date - 2021-06-12T05:02:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్‌ నాయకత్వంలో విజయనగరంలోని పెట్రోల్‌ బంకుల వద్ద శుక్రవారం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పెట్రో మంటలపై నిరసన
విజయనగరం బాలాజీ కూడలిలో పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆటో లాగుతూ కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన

విజయనగరం, జూన్‌ 11: కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్‌ నాయకత్వంలో విజయనగరంలోని పెట్రోల్‌ బంకుల వద్ద శుక్రవారం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఒక వైపు ఇష్టం వచ్చినట్లు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతుండగా రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో మరింత భారాన్ని మోపుతోందన్నారు. అనంతరం ఆటో లాగుతూ నిరసన తెలిపారు. చీపురుపల్లిలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-06-12T05:02:45+05:30 IST