కేంద్రం తీరుపై నిరసన
ABN , First Publish Date - 2021-02-27T05:36:26+05:30 IST
కేంద్రం తీరుపై ప్రజా సంఘాలు గళమెత్తాయి. వామపక్షాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన చేపట్టారు.
పెట్రో ధరలు తగ్గించాలి
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తగదు
భారత్ బంద్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన
కేంద్రం తీరుపై ప్రజా సంఘాలు గళమెత్తాయి. వామపక్షాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన చేపట్టారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన చేశారు. రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి బృందం)