డెల్టా పేపర్మిల్లు మూసివేతపై నిరసన
ABN , First Publish Date - 2022-05-24T05:36:16+05:30 IST
డెల్టా పేపర్మిల్లు మూసివేతపై రిలే నిరాహార దీక్ష 104వ రోజుకు చేరుకుంది.
పాలకోడేరు / భీమవరం టౌన్, మే 23: డెల్టా పేపర్మిల్లు మూసివేతపై రిలే నిరాహార దీక్ష 104వ రోజుకు చేరుకుంది. దాదాపు 250 మంది కార్మికులు మోటార్ సైకిల్ ర్యా లీగా కలెక్టరేట్కు వెళ్లి ధర్నా చేపట్టారు. వేండ్ర, గుత్తివారి పాలెం, పాలకోడేరు, కుముదవల్లి మీదుగా భీమవరం కలెక్టరేట్కు చేరుకుని కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై త్వరలో జేఏసీతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ త్వరలో జేఏసీతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. జేఎన్వీ.గోపాలన్, రాజా రామ్మోహనరావు, వైఎస్ఎన్.మూర్తి, వివి.భద్రం, టి.శ్రీను, సీహెచ్.కు టుంబరావు, పి.అశోక్, వి.దానయ్య, బి.సూర్యనారాయణ, పి.శ్రీను పాల్గొన్నారు.