AP News: అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతల నిరసన

ABN , First Publish Date - 2022-08-26T01:05:31+05:30 IST

Amaravathi: కుప్పం (Kuppam) నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra babu Naidu) పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయి. అడ్డంకులు, విధ్యంసాలకు పాల్పడుతూ చంద్రబాబు పర్యటనను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ దాడులను

AP News: అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతల నిరసన

Vijayawada:   కుప్పం (Kuppam) నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra babu Naidu) పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయి. అడ్డంకులు, విధ్యంసాలకు పాల్పడుతూ చంద్రబాబు పర్యటనను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ దాడులను ఖండిస్తూ విజయవాడ (Vijayawada)లో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో చేతికి సంకెళ్లు కట్టుకుని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరసన  తెలిపారు. బోండా ఉమా (Uma) ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూయించడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ రౌడీమూకల దాడిని ఖండిస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు‌ వైసీపీ రౌడీల అనుమతి కావాలా ? అని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తుండడం దురదృష్టకర మన్నారు. అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-26T01:05:31+05:30 IST