ట్రస్మా సభ్యుల నిరసన
ABN , First Publish Date - 2022-01-19T04:21:25+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను సెలవులను పొడగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కుమరం భీం జిల్లా ట్రస్మా సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు.
కాగజ్నగర్, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను సెలవులను పొడగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కుమరం భీం జిల్లా ట్రస్మా సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్ రావు మాట్లాడుతూ విద్యా సంస్థలు పునః ప్రారంభమైన తర్వాత ఇప్పటికీ ఇంకా సిలబస్ 50 శాతం పూర్తిగా కాలేదన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. పక్కనున్న ఏపీలో పాఠశాలల పట్ల ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. ఇక్కడ ఆంక్షలు విధించటం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరో మారు సమీక్షించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. సమావేశంలో ట్రస్మా సభ్యులు సుజాత్ అలీ, తాజుద్దీన్, సురవర్థన్, ప్రసాద్, సంజయ్సింగ్, మెరాజ్హుస్సెన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.