23న సచివాలయాల వద్ద నిరసన
ABN , First Publish Date - 2020-07-12T11:26:25+05:30 IST
ప్రైవేటీకరణ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈనెల 23న సచివాలయాల వద్ద నిరసన తెలియజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ
భామిని: ప్రైవేటీకరణ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈనెల 23న సచివాలయాల వద్ద నిరసన తెలియజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్ తెలిపారు. శనివారం భామినిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావే శం నిర్వహించారు. ఆగస్టు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సంఘ నాయకులు బి.రామారావు, జి.ప్ర సాద్, అబ్దులమ్మ, వెంకటమ్మ, భాస్కరరావు, కృష్ణారావు పాల్గొన్నారు.