బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
ABN , First Publish Date - 2022-05-11T05:28:23+05:30 IST
గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
కామారెడ్డిటౌన్,మే 10: గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు తొత్తుగా మారి మైనార్టీల మెప్పుకోసం పనిచేస్తూ ఇతర వర్గాలను మోసం చేస్తుందన్నారు. బీజేవైఎంం నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని వారిని పోలీసుస్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నరేందర్రెడ్డి, నాయకులు చందు, వేణు, భరత్, రాజేష్, రమేష్రెడ్డి, రాజీరెడ్డి, ప్రేమ్, విజయ్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.